హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను హిరోయిన్ల కాల్షీట్లూ అమ్ముకున్నాడు, శింగనమల చుట్టూ ఉచ్చు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ తెలుగు హీరోయిన్ల కాల్షీట్లు కూడా అమ్ముకున్నాడని సమాచారం. ఇద్దరు నిర్మాతలతో సంబంధాలున్న భానుకిరణ్‌ ముగ్గురు హీరోయిన్ల కాల్షీట్లను ఇతర నిర్మాతలకు రూ.లక్షల్లో అమ్ముకుని వారిని మోసం చేసినట్టు తెలిసింది. రక్తచరిత్ర సినిమాకు సమన్వయకర్తగా వ్యవహరించినప్పుడు భానుకిరణ్‌కు పలువురు నటులు, హీరోయిన్ల వ్యక్తిగత కార్యదర్శులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నలుగురు సినీ నిర్మాతల వద్ద వారివారి తదపరి చిత్రాల్లో తనకు తెలిసిన హీరోయిన్లు నటిస్తారంటూ నమ్మించి రూ.లక్షల్లో అడ్వాన్సులు పుచ్చుకున్నాడు. తర్వాత వీరు హీరోయిన్లను సంప్రదిస్తే అసలు విషయం బయటపడింది.

నిర్మాత రమేష్‌ సంపాదన నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. దీని వెనుక ఆయనకు భానుతో ఉన్న సంబంధాలే కారణమా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆదాయపు పన్నుశాఖ నుంచి ఆదాయ వివరాలు సేకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2002లో రమేష్‌ సమర్పించిన ఆదాయపు పన్ను ధ్రువపత్రంలో వ్యవసాయ ఆదాయం రూ. 1.5 లక్షలు, సొంత ఆదాయం రూ. 24 లక్షలుగా చూపించాడు. 2006 నాటికి మొత్తం సంపాదన రూ. 1.10 కోట్లకు పెరిగింది. ఇది అధికారికంగా చూపించిందేనని, వాస్తవంగా ఇంతకు పది రెట్లయినా ఉంటుందని పోలీసులే చెబుతున్నారు. అప్పు తీసుకోవడం, అడిగితే భానుతో బెదిరించడం వంటి చర్యలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క తన సొంత జిల్లా అనంతపురంలోనూ రమేష్‌పై పదుల సంఖ్యలో చెక్‌బౌన్స్‌ కేసులు ఉన్నాయని సీసీఎస్‌ పోలీసులు చెబుతున్నారు. అనంతపురం నుంచి ఈ వివరాలు తెప్పిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X