వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ జిల్లా జఫర్‌ గఢ్‌ లో లాకప్‌ డెత్?: ఉరి అంటున్న పోలీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: జిల్లాలోని జఫర్‌గఢ్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి మరణించడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జఫర్‌గఢ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన చేరాలు అనే వ్యక్తిని వారం రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేశాడనే కేసుపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గురువారం ఉదయం తన జైలు గదిలో చేరాలు ఉరి వేసుకొని చనిపోయాడు.

అయితే మృతుని బంధువులు చేరాలు ఉరి వేసుకున్నాడనే విషయాన్ని ఖండిస్తున్నారు. అతను ఉరి వేసుకోలేదని, పోలీసులే లాకప్ డెత్ చేసి ఉరి అని అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అతనితో పాటు గదిలో ముగ్గురు నిందితులున్నారు. వారంతా చూస్తుండగా అతను ఎలా ఉరి వేసుకుంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X