వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి ప్రభుత్వంలో చేరే ప్రతిపాదనపై ఎంపి సబ్బం హరి కొర్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
న్యూఢిల్లీ: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేర్చుకునే విషయంపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కొర్రీ పెడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని ప్రభుత్వంలో చేర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన కాంగ్రెసు అధిష్టానాన్ని హెచ్చరించారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వంలో చేరాలనే నిర్ణయాన్ని తెలియజేశారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ హెచ్చరిక చేశారు. తమ కార్యకలాపాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే అధిష్టానంపై తమపై సస్పెన్షన్ వేటు వేసిన అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని పరిస్థితిని చక్కదిద్దతే కాంగ్రెసు పార్టీలో కొనసాగడానికి తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుందని తాను గతంలోనే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో తాము కలిసిన నెల రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. సబ్బం హరి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఢిల్లీలో జరిగిన జగన్ జలదీక్షలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X