Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ ‌కు ముఖ్యమంత్రికి మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

BS Yeddyurappa
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యాడ్యూరప్పకు, గవర్నర్ హెచ్ఆర్ భరధ్వాజ్‌లకు మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. గత కొద్దికాలంగా వీరి ఇద్దరి మధ్య సయోధ్య లేని కారణంగా రాష్ట్ర రాజకీయాలు వేడుక్కుతున్నాయి. అక్రమమైనింగ్‌తో పాటు యాడ్యూరప్ప ఎదుర్కుంటున్న పలు అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆయను భరధ్వాజ్ కోరడంతో మొదలైన వివాదం చిలికి చిలకి గాలివానగా మారింది. ఈ కేసులో విచారణకు అనుమతించవద్దంటూ రాష్ట్రబంద్‌‌ కు పిలుపునివ్వాలని బిజెపి నిర్ణయించడానిపై స్పందించిన భరధ్వాజ్ తప్పుచేసిన వారు తనను బెదిరించాలని చూస్తే బెదిరిపోనని చెప్పారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ భరధ్వాజ్‌ను రీకాల్ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిలను యాడ్యూరప్ప కోరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆయన ఓ లేఖను సమర్పించనున్నారు. అంతే కాకుండా జనవరి 24న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా యాడ్యూరప్ప కలవనున్నారు. యాడ్యూరప్ప ఎదుర్కుంటున్న వివిధ కుంభకోణాలపై విచారణ జరిపించాలని ఆయనపై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను భరధ్వాజ్ అనుమతించడంపై యాడ్యూరప్ప మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గవర్నర్ భరధ్వాజ్‌కు ఓ లేఖ రాశారు.

కాగా..ఈ లేఖపై స్పందించిన భరధ్వాజ్ మీడియాతో మాట్లాడుతూ..ఓ దొంగ తిరిగి పోలీసునే ప్రశ్నించింనట్లుగా... యాడ్యూరప్ప వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. భరధ్వాజ్ చేసిన వ్యాఖ్యలపై యాడ్యూరప్ప స్పందిస్తూ.. తన సర్కారును సంక్షోభంలో పడేయటానికి గవర్నర్ రాజకీయ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+