నాగం జనార్దన్ రెడ్డికి మూడినట్లే, మోత్కుపల్లి నర్సింహులు ఫైర్

అప్పుడే తెలంగాణ వచ్చేసినట్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుదామని తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమం తెలంగాణ కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా అని ఆయన అడిగారు. కొందరు తెలంగాణ నాయకులను పార్టీలో సమైక్యవాదులుగా చిత్రీకరించడం సరి కాదని ఆయన అన్నారు. పార్టీని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేద్దామని, ఆధిపత్య పోరు వద్దని ఆయన అన్నారు. ఆధిపత్య వర్గాలు తమలాంటి బలహీన వర్గాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అధికారం కోసం ఉరుకులాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు విమర్శలతో తెలుగుదేశంలోని తెలంగాణ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.












Click it and Unblock the Notifications