వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ కు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ‌: కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన ప్రాతినిధ్యం లేదని విమర్శించిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు లగడపాటి రాజగోపాల్ చురకలు అంటించారు.కేంద్ర మంత్రి మండలిలో రాష్ట్రానికి 2009లో ఎంత ప్రాతినిధ్యం ఉందో ఇప్పుడూ అంతే ఉందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ చెప్పారు. అప్పట్లో మంత్రివర్గం ఏర్పడినప్పుడు వైఎస్‌ జగన్మోహన్ ‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఇప్పుడు కొత్తగా ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. "అభ్యంతరాలున్నప్పుడు ఎప్పుడూ ఒకలాగానే ఉండాలి. బయట ఉన్నప్పుడు ఒకమాట, లోపలున్నప్పుడు ఒకమాట మాట్లాడటం సబబు కాదు" అని ఆయన అన్నారు. ఢిల్లీలో శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు వీరప్ప మొయిలీని కలిసిన తర్వాత లగడపాటి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పాలన లేదని, కేంద్రంలో రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం లేదని జగన్‌ చేసిన విమర్శలను పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. మే 24 నాటికి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుందని, ఆ సందర్భంగా భారీ విస్తరణ జరుగుతుందని, కచ్చితంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. "2004, 2009ల్లో రాష్ట్రానికి లభించని అవకాశం 2011లో దక్కనుంది. ప్రస్తుతం రాజా, శశి థరూర్‌, పృథ్వీరాజ్‌ చవాన్‌ రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు. దీన్ని విస్తరణగా భావించడానికి వీల్లేదు" అని చెప్పారు. రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్న జగన్‌ విమర్శలను లగడపాటి కొట్టిపారేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X