రచ్చబండను అడ్డుకోండి: తెలంగాణ ప్రజలకు నాగం పిలుపు

తెలంగాణపై జరిగిన అన్యాయాన్ని చర్చించడానికో, శ్రీకృష్ణ కమిటీపై చర్చకో రచ్చబండను ఉపయోగించి తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షను తెలుసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఓ పనికి రాని రిపోర్టు అన్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రచ్చబండను ఏర్పాటు చేయండి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రశాంతంగా ఉందని సంకేతాలు పంపే ఉద్దేశ్యంతో రచ్చబండను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కాదన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు మానసికంగా విడిపోయి ఉన్నారన్నారు. మానసికంగా విడిపోయిన వారిని బలవంతంగా కలిపి ఉంచుదాం అనుకోవడం శోచనీయమన్నారు.
మాకు కావాల్సింది రాజ్యాంగ బద్ద రక్షణ కాదని ప్రత్యేక తెలంగాణ అని చెప్పారు. పెద్దమనుషుల ఒప్పందం, ఫజల్ అలీ కమిషన్, 610 జీవోలు అన్నింటినీ అణగదొక్కి మళ్లీ రాజ్యాంగబద్ద రక్షణ అనడం సరికాదన్నారు. సాధ్యం కాని విషయాన్ని ప్రజల ముందు పెట్టి అయోమయానికి గురు చేస్తున్నారన్నారు. విద్యార్థులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. సోమవారం ప్రారంభించబోయే రచ్చబండను తప్పకుండా అందరూ అడ్డుకోవాలన్నారు.సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలంగాణవాదులను కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రచ్చబండను రచ్చరచ్చ చేయాల్సిందేనన్నారు.












Click it and Unblock the Notifications