విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ కంటే సోనియా, రాహుల్ గొప్పవారు కాదు: అంబటి రాంబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
విశాఖపట్టణం: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ కంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చాలా గొప్పవారు అని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు ఆదివారం వ్యాఖ్యానించారు. వారు అంత గొప్పవారే అయితే ఉత్తర ప్రదేశ్, బీహార్‌లలో కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించలేక పోయారని ప్రశ్నించారు. వైయస్ కంటే వారేమీ గొప్పకాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సిఎం పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదన్నారు. ఆయనను మంత్రులు, ఎమ్మెల్యేలే ఛీ కొడుతున్నారన్నారు.

సోనియాగాంధీ కన్నెర్ర చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ పీఠం కదిలి పోతుందని అన్నారు. ముఖ్యమంత్రికి ఆ సీటుపై కూర్చునే ఆర్హత ఏమాత్రం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్‌రెడ్డి బఫూన్లు అని విమర్శించారు. పార్టీకి చేసిన వారికే పదవులు అంటూ ముఖ్యమంత్రి అంటున్నారని, అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రధాని కాకముందు పార్టీకి ఏమేరకు సేవలు చేశారని ప్రధానిని చేశారని ప్రశ్నించారు. ఎప్పుడుపడితే అప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేయరని సమయం వచ్చినప్పుడు వారే రాజీనామా చేస్తారని అన్నారు. తెలుగులో సరిగా ప్రమాణస్వీకారం చేయలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగువారికి ఏవిధమైన సేవ చేస్తారని అంబటి ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం పెట్టి మీ బలం నిరూపించుకోవాలని సిఎంకు జగన్ వర్గం మరోనేత గోనే ప్రకాశ్‌రావు ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీని విడగొట్టినప్పుడు ఆమె వెంట వచ్చిన వారికంటే ఇప్పుడు జగన్ వెంటే ఎక్కవ ప్రజలు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలకు జగన్‌నుగానీ, వైయస్‌నుగానీ విమర్శించే హక్కు లేదన్నారు. పార్టీని ఇందిరాగాంధీ చీల్చిందన్నారు. ఇందిర చీల్చిన పార్టీ కాబట్టి పార్టీకి ఇప్పుడు ముప్పయ్యేళ్లేనని, 125 సంవత్సరాలు కాదని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X