వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్‌ పై ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ పరిధి దాటారు: మేకపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన పరిధి దాటి మాట్లాడారని పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. జగన్‌కు ఉన్న రాజకీయ పరపతి గురించి తెలిసే ప్రజలు భారీగా తరలి వస్తున్నారని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కిరణ్ అనవసర వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఎందుకంటే ఆయన లేరు కాబట్టి వివరణ ఇచ్చుకోలేరు కాబట్టే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై మళ్లీ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వేరుగా డిమాండ్ చేశారు. హెలికాప్టర్ బయలుదేరే 15 నిమిషాల ముందు కిరణ్ డ్రాప్ కావడానికి కారణాలు వెలికి తీయాల్సి ఉందన్నారు. జగన్‌పై ముఖ్యమంత్రి అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X