హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైభోలో తెలంగాణను అడ్డుకోవద్దని సెన్సారుబోర్డు వద్ద లాయర్ల ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jai Bolo Telangana
హైదరాబాద్: జైభోలో తెలంగాణ చిత్రం విడుదలను అడ్డుకోవద్దని డిమాండ్ చేస్తూ పలువురు తెలంగాణ లాయర్లు మాసాబ్‌ట్యాంకులోని సెన్సారు బోర్డు కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు. ఐదున్నర శతాబ్దాల తెలంగాణ బాధను తెరకెక్కించిన చిత్రాన్ని అడ్డుకోవడం సీమాంధ్ర పాలకుల కుట్రగా వారు ఆరోపించారు. ఆ చిత్రాన్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమైక్య పాలనలో పోరాడితే తప్ప తెలంగాణకు న్యాయం జరగటం లేదన్నారు. గతంలో కూడ తాము హైకోర్టులో 42 శాతం కోసం పోరాడితేనే సాధించుకున్నామన్నారు.

జైభోలో తెలంగాణ చిత్రాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే సీమాంధ్ర పాలకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ సమేతంగా చూడలేని అశ్లీలత, అసభ్యత కలిగిన చిత్రాలకు, కత్తులతో పొడుచుకోవడం, బాంబులతో దాడులు, నరకడాలు వంటి సన్నివేశాలు ఉన్నా ఎన్నో చిత్రాల విడుదలకు నో చెప్పని సెన్సారు బోర్డు తెలంగాణ చారిత్రక కథను, వ్యథలను తెరరూపానికి తీసుకు వస్తే అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజకీయ నేతలు చంపించిన ఘటనలు, ఐఎస్ఐ వంటి పలు చిత్రాలను కూడా సెన్సారు అడ్డుకోలేదన్నారు. కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X