జగన్ ప్రమేయం ఉందని తెలుస్తోంది: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు

నేరస్థులను సమర్థించడం కూడా నేరమేనని, పరిటాల రవి హత్య కేసులో జగన్ను కాపాడానని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఆయన అన్నారు. స్పష్టమైన ఆధారాలున్న పరిటాల రవి హత్య కేసునే పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. సూట్కేసు బాంబు కేసుకు కొనసాగింపే పరిటాల రవి హత్య అని ఆయన అన్నారు. సర్వీస్ బుల్లెట్ ఉన్నట్లు పరిటాల రవి మృతదేహంపై జరిగిన రీపోస్టుమార్టంలో తేలిందని ఆయన చెప్పారు.
నల్లధనాన్ని వెలికి తీయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారున. నల్లధనం కలిగి ఉన్నవారి పేర్లు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. బ్లాక్ మనీని స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications