వైయస్ జగన్‌పై మరోసారి రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఫైర్

DL Ravindra Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ధనబలం, కండబలం ఉన్నవారితో తాను పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. తనకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వాటికి దీటుగా సమాధానమిస్తానని, ఇదే విషయం బెదిరింపు కాల్స్ వస్తున్న మంత్రి శంకరరావుకు కూడా చెప్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బెదిరింపు కాల్స్ వ్యవహారాన్ని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన చెప్పారు.

పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్నవారిని మంత్రులు ఎదుర్కోవడం లేదనే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దృష్టికి తీసుకుని పోతానని ఆయన చెప్పారు. పరిటాల రవి హత్య కేసును సిబిఐ పునర్విచారణ జరిపించాలని తాను కోరుతానని, ఈ విషయంలో వస్తున్న వార్తల నిగ్గు తేల్చాలని తాను మంత్రివర్గంలో కోరుతానని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులను కొనేవారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై రోజూ మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాభపడుతారని, ప్రజలకు లాభం జరగదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే కెసిఆర్ సీట్లు పెరుగుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+