జగన్కు వస్తున్న జనాలను చూసే అలా అంటుండవచ్చు: రోశయ్య

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు స్వేచ్ఛనిచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన వరదలు తనకు ఎక్కువగా బాధ కలిగించాయని ఆయన చెప్పారు. 1953కు ముందు గుంటూరులో హైకోర్టు బెంచ్ ఉండేదని, అప్పుడు దాన్ని తరలించినప్పుడు ఇక్కడి న్యాయవాదులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమం సాగుతున్నందు వల్లనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వివాదం వల్లనే మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications