వైయస్ జగన్, మంగలి కృష్ణలను అరెస్టు చేయాలి: దేవినేని ఉమ

Devineni Umamaheswara Rao
విజయవాడ: పరిటాల రవి హత్య కేసులో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, ఆయన అనుచరుడు మంగలి కృష్ణలను వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండడంతో పరిటాల రవి హత్య కేసు నుంచి తన కుమారుడు వైయస్ జగన్‌ను తప్పించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. మంగలి కృష్ణను విచారించేందుకు సిబిఐ సమన్లు జారీ చేసే సమయంలో వైయస్సార్ రంగంలోకి దిగి ఆపించారని ఆయన ఆరోపించారు. సిబిఐ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి దర్యాప్తును సరిగా చేయలేకపోయిందని ఆయన అన్నారు.

మద్దెలచెర్వు సూరి వైయస్ జగన్ పెట్టే కొత్త పార్టీకి సహకరించకపోవడం, కాంగ్రెసు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడని, ఈ స్థితిలో సూరి హత్య జరిగిందని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలను మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో హంతకులకు శిక్షణ ఇచ్చిన రిటైర్డ్ కానిస్టేబుళ్లు ఎవరు, వారికి సహకరించిన పోలీసులు ఎవరు, హంతకులకు ఎవరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించారు అనే విషయాలు బయటపడాలని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసుపై సిబిఐ చేత తిరిగి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+