పరిటాల హత్యపై చంద్రబాబు ఆరోపణలకు జగన్ సాక్షి డైలీ కౌంటర్
ఫాక్షనిజాన్ని పెంచి పోషించిన చంద్రబాబు తన తండ్రి హంతకులను కూడా వదిలేసిన వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై నిసిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. పరిటాల రవి హత్యను వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముడిపెట్టే దారుణానికి చంద్రబాబు దిగారని, అందుకోసం ఏకంగా రాజకీయ ప్రత్యర్థయిన కాంగ్రెస్ అధిష్టానంతోనూ, సీఎం కిరణ్కుమార్రెడ్డితోనూ చేతులు కలిపారని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. నక్సలైట్ ఉద్యమం నుంచి ఫ్యాక్షన్ బాట పట్టిన పరిటాల రవీంద్రపై పలు హత్యారోపణలున్నాయి. పెనుకొండ మాజీ ఎమ్మెల్యేలు ఓబుల్రెడ్డి, సానె చెన్నారెడ్డి, సానె వెంకట రమణారెడ్డి హత్యలతో పాటు అనేక దాడులు, హింసాత్మక సంఘటనల్లో పరిటాల రవికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించింది. పరిటాల, మద్దెలచెర్వు కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న పగలు, ప్రతీకారాలను కూడా రాజకీయాలకు ముడిపెట్టారని ఆయన అన్నారు.