ఉండవల్లిపై భగ్గుమన్న వైయస్ జగన్ క్యాంప్ నేత అంబటి రాంబాబు
వైయస్ నేరుగా లేఖలను అధిష్టానానికి పంపేవారని, ఆ లేఖ గురించి ఉండవల్లికి తెలిసే అవకాశం లేదని, ఉండవల్లి వెనక ఎవరో ఉండి ఆ పనిచేయించారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబాన్ని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్న నీచమైన ఎత్తుగడలో ఉండవల్లి పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాసినట్లు చెబుతున్న లేఖపై ఉండవల్లి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వైయసే తమకు అధిష్టానంగా ఉండేవారని ఆయన అన్నారు. వైయస్కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి నీచమైన ఎత్తుగడలో ఎందుకు పాలు పంచుకుంటున్నారని అడుగుతున్నానని ఆయన అన్నారు. వైయస్ ఉన్నప్పుడే ప్రజారాజ్యం గురించి చెప్పారు కాబట్టి చేస్తున్నామంటున్నవారు కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన రోజా విషయంలో ఎందుకు సానుకూలంగా వ్యవహరించలేదని ఆయన అడిగారు.
జగన్ను అణచివేయడానికి చిరంజీవితో దోస్తీ కడుతున్నారని ఆయన విమర్సించారు. వైయస్ దయ వల్లనే తాను, ఉండవల్లి ఇలా ఉన్నామని, కాంగ్రెసు నీచమైన ఎత్తుగడలో ఉండవల్లి పాలు పంచుకోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. వైయస్ను అవినీతి చక్రవర్తి అన్నప్పుడు ఖండించడానికి ఉండవల్లి ఎందుకు ముందుకు రాలేదని ఆయన అడిగారు.