మజ్లీస్ పార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొత్తు ఖరారు?

మజ్లీస్తో జత కట్టడంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాదు రచ్చబండ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. హిందూ తీవ్రవాదమంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. దానికితోడు ముస్లిం మైనారిటీలకు తాయిలాలు ప్రకటించారు. ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, కేసుల్లో ఇరుక్కున్న వారికి తగిన పరిహారం చెల్లిస్తామని, కేసులతో సంబంధం లేని ముస్లిం యువతకు దాన్ని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు.
మజ్లీస్తో జతకట్టడానికి అనువుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముస్లింల పట్ల సానుకూలంగా ఉందని చెప్పి మజ్లీస్ నేతలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడానికి అవసరమైన రంగం సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications