హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదివారమే కాంగ్రెసు పార్టీలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసులో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ విలీనం ఊహాగానాలకు ఆదివారమే తెర పడే అవకాశాలున్నాయి. ఆదివారంనాడు విలీనంపై తుది నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. చిరంజీవి ఆదివారంనాడు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని, ప్రజారాజ్యం పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలని సోనియా లాంఛనంగా చిరంజీవిని కోరుతారని అంటున్నారు. వెంటనే చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో సమావేశమవుతారని, ఈ సమావశానికి హాజరు కావడానికి శాసనసభ్యులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.

విలీనం నిర్ణయం తీసుకునే బాధ్యతను శాసనసభ్యులు చిరంజీవికి అప్పగిస్తారని అంటున్నారు. ఆ వెంటనే శాసనసభ్యులతో కలిసి చిరంజీవి సోనియాను కలుస్తారని, విలీనంపై చిరంజీవి అధికారికంగా ప్రకటించిన తన శాసనసభ్యులతో కలిసి సోనియాతో గ్రూప్ ఫొటో దిగుతారని అంటున్నారు. విలీనానికి ఇప్పటికే ఆంటోనీ హైదరాబాదు వచ్చినప్పుడే ఓ ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకారం శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నవారిని కొంత మందిని శాసనమండలికి ఎంపిక చేయాలి. ఈ విలీనంతో బొటాబొటి మెజారిటీ నడుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బలం చేకూరుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X