రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువకుడిని చితకబాదిన పోలీసులు, రచ్చబండలో ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar District
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడుగుల మండలం సుంకరపల్లి గ్రామం రచ్చబండలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రచ్చబండ పెట్టొద్దంటూ ఓ యువకుడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటింటుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని చితకబాదారు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడిని పోలీసులు కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులు ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసులు గ్రామస్థులను చితకబాదారు. కాగా, రంగారెడ్డి జిల్లా థరూర్ గ్రామంలో రచ్చబండ టెంటును దగ్ధం చేశారు. దీంతో శాసనసభ్యుడు ప్రసాద్ రచ్చబండ కార్యక్రమానికి వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X