కాంగ్రెసు హై కమాండ్ పిలుపు: నేడు సాయంత్రమే ఢిల్లీకి చిరు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో సంబంధాలపై సోనియా చిరంజీవితో మాట్లాడుతారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, అది గౌరవప్రదంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు. తన నుంచి ప్రతిపాదన వచ్చిందని, అందుకు చిరంజీవి అంగీకరించారని సోనియా స్వయంగా ప్రకటించేలా చూడాలని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చిరంజీవికి సూచిస్తున్నారు. అలాగే, చిరంజీవికి, తమకు తగిన రక్షణలు ఉండాలని కూడా వారు కోరుతున్నారు.
సోనియా గాంధీ చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసు హైదరాబాద్ sonia gandhi chiranjeevi prajarajyam congress hyderabad
Story first published: Saturday, February 5, 2011, 12:30 [IST]