హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు హై కమాండ్ పిలుపు: నేడు సాయంత్రమే ఢిల్లీకి చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఢిల్లీకి రావాల్సిందిగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుంచి ఆహ్వానం అందింది. వెంటనే ఢల్లీకి రావాలని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన పెద్దలు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో చిరంజీవి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో సంబంధాలపై సోనియా చిరంజీవితో మాట్లాడుతారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, అది గౌరవప్రదంగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నారు. తన నుంచి ప్రతిపాదన వచ్చిందని, అందుకు చిరంజీవి అంగీకరించారని సోనియా స్వయంగా ప్రకటించేలా చూడాలని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చిరంజీవికి సూచిస్తున్నారు. అలాగే, చిరంజీవికి, తమకు తగిన రక్షణలు ఉండాలని కూడా వారు కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X