హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియాతో భేటీ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాతనే తమ దోస్తీపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. సోనియాతో సమావేశమయ్యేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ఆయన శనివారం సాయంత్రం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సోనియాతో బేటీ తర్వాత పార్టీ నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం ఆహ్వానం మేరకే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

నిజానికి ఈ నెల 7వ తేదీన సోనియా గాంధీతో తాను సమావేశం కావాల్సి ఉందని, అయితే కొన్ని ఇతర కారణాల వల్ల ముందే భేటీ ఖరారైందని ఆయన చెప్పారు. రెండు పార్టీలు బలోపేతం అయ్యే అవకాశం ఉండే విధంగా దోస్తీ ఉంటుందని ఆయన చెప్పారు. సోనియాతో భేటీ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సోనియాతో సమావేశమవుతారు. తిరిగి అహ్మద్ పటేల్‌తోనూ ఇతర కాంగ్రెసు అధిష్టానం నేతలతోనూ సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X