హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కాంగ్రెసులో కలవడం లాభమే: కాంగ్రెసు ఎంపీ మధు యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రావడం తమ పార్టీలోకి రావడం లాభమేనని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కాబోతోందనే వార్తలపై ఆయన ఆ విధంగా అన్నారు. ఆయన శనివారం తెలంగాణ న్యాయవాదుల సమరభేరీ పోస్టర్‌ను విడుదల చేశారు. న్యాయవాదులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించాలని ఆయన సూచించారు. తమ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా) మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

తెలంగాణకు కొందరు పెద్దలు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు పదవిలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్సించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఒకే అభిప్రాయంతో ఉండాలని ఆయన సూచించారు. రాజకీయ సంక్షోభంతో తెలంగాణ రాకపోతే ఈజిప్టు తరహా ఉద్యమం సాగుతుందని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X