వైయస్ జగన్‌కు కాంగ్రెసు ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ శనివారం బహిరంగ లేఖ రాశారు. తాను బయటపెట్టిన ప్రజారాజ్యం పార్టీతో స్నేహం అవసరంపై వైయస్ రాజశేఖర రెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖపై సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. తన లేఖ నిజమైనది కాకపోతే తనను ప్రాసిక్యూట్ చేయవచ్చునని ఆయన అన్నారు. లేఖ బోగస్ అయితే తనపై సైబర్ నేరం కింద జగన్ వర్గం నాయకులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించవచ్చునని ఆయన సవాల్ చేశారు. తాను జగన్ సందేహాన్ని నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను ఇ - మెయిల్ చేయమన్నా చేస్తాను లేదంటే జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తానని ఆయన అన్నారు.

తనకు వైయస్సార్ మెయిల్ చేసిన లేఖలోని మొదటి పేరాను మాత్రమే వెల్లడించానని, మిగతా పేరాలను విడుదల చేయలేదని, మొత్తం లేఖను జగన్‌కు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఎవరైనా వచ్చి తన నుంచి లేఖను తీసుకోవచ్చునని ఆయన అన్నారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డికి మిత్రద్రోహిని కానని, తాను వైయస్ అనుయాయుడినని ఆయన చెప్పుకున్నారు. తన వ్యక్తిత్వం వైయస్ రాజశేఖర రెడ్డికి తెలుసునని ఆయన అన్నారు. తాను అసత్య ప్రచారం చేసేవాడిని కానని, ఆనాడు వైయస్ మాటను పాటించినవాడినని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+