వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుతో దోస్తీ చేసుకోవాలని వైఎస్‌కు నేనే సూచించా: ఎంపీ లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విశాఖపట్టణం: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే సలహాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తానే ఇచ్చానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆదివారం విశాఖపట్టణంలో అన్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యానికి రాష్ట్రంలో మంచి ఓటింగ్ వచ్చిన నేపథ్యంలో చిరును కాంగ్రెస్‌తో కలుపుకొని పోతే కాంగ్రెస్‌కు తిరుగు ఉండదని తాను వైఎస్‌కు సూచించానని చెప్పారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ 2014 సాధారణ ఎన్నికల వరకు ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పీఆర్పీ-కాంగ్రెస్ దోస్తీపై విమర్శలు చేసిన మాజీ మంత్రి శివశంకర్ వ్యాఖ్యలపైన కూడా లగడపాటి స్పందించారు. శివశంకర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేరని చెప్పారు. అందుకే ఆయన వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయితే కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో లేని శివశంకర్ కాంగ్రెస్ వ్యవహారాలతో ఏం సంబంధం అని ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X