చిరంజీవి, వైయస్ జగన్లపై చంద్రబాబు తీవ్రమైన కామెంట్స్

వైయస్ జగన్ 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారని, ఆ రకంగా జగన్ ఆదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, అయితే ఆ ఆదాయం జగన్ ఏ రూపంలో సంపాదిస్తున్నాడనే విశ్లేషణ లేకుండా పోయిందని, అక్రమ సంపాదనను క్రమబద్దీకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నల్లధనాన్ని క్రమబద్దీకరించే పనికి ప్రభుత్వం పూనుకుందని, ఇది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. దేశాన్ని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లధనంపై సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీన వైకరి అవలంబించడమే కాకుండా నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చడానికి తగిన పద్ధతులు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు నాయకులు పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తోలుబొమ్మలుగా మారిపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పార్టీ నుంచి వెళ్లిపోయిన వైయస్ జగన్తో బహిరంగంగా తిరుగుతున్నారని, అయినా కాంగ్రెసు చర్యలు తీసుకోవడం లేదని, నీతిమాలిన రాజకీయాలను సాగిస్తున్నారని ఆయన అన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications