చిరంజీవి, వైయస్ జగన్లపై చంద్రబాబు తీవ్రమైన కామెంట్స్
వైయస్ జగన్ 83 కోట్ల రూపాయల ముందస్తు పన్ను చెల్లించారని, ఆ రకంగా జగన్ ఆదాయం 250 కోట్ల రూపాయల దాకా ఉంటుందని, అయితే ఆ ఆదాయం జగన్ ఏ రూపంలో సంపాదిస్తున్నాడనే విశ్లేషణ లేకుండా పోయిందని, అక్రమ సంపాదనను క్రమబద్దీకరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నల్లధనాన్ని క్రమబద్దీకరించే పనికి ప్రభుత్వం పూనుకుందని, ఇది దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. దేశాన్ని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లధనంపై సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీన వైకరి అవలంబించడమే కాకుండా నల్లధనాన్ని సక్రమ డబ్బుగా మార్చడానికి తగిన పద్ధతులు అవలంబిస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు నాయకులు పదవుల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాష్ట్ర నాయకులు ఢిల్లీకి తోలుబొమ్మలుగా మారిపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు పార్టీ నుంచి వెళ్లిపోయిన వైయస్ జగన్తో బహిరంగంగా తిరుగుతున్నారని, అయినా కాంగ్రెసు చర్యలు తీసుకోవడం లేదని, నీతిమాలిన రాజకీయాలను సాగిస్తున్నారని ఆయన అన్నారు.