కెసిఆర్ ఏ కోర్ కమిటీ సభ్యుడితో మాట్లాడుతున్నారో తెలియదా: దేవేందర్
తెలంగాణ సాధనలో కెసిఆర్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని తాము కోరుకుంటున్నామని, కానీ తెలుగుదేశం పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించబోమని ఆయన అన్నారు. గాలి మాటలు మాట్లాడుతూ కెసిఆర్ తమపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ సమస్యలపై ఏనాడూ పోరాటం చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో కెసిఆర్ కుమ్మక్కయిన మాట నిజమని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బలపడిన స్థితిలో కెసిఆర్ ఆవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తేవడం వెనక ఉద్దేశమేమిటని ఆయన అడిగారు.
ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల వైయస్ జగన్ కాంగ్రెసు నుంచి వెళ్లిపోయారని ఆయన అన్నారు. ప్రజల కోసమో, సిద్ధాంతాల కోసమో జగన్ కాంగ్రెసు పార్టీని వ్యతిరేకించలేదని ఆయన అన్నారు. జగన్ వెంట ఎవరుంటారో, ఎవరు ఉండరో తెలియని అయోమయ స్థితి అని, ఈ స్థితిలో జగన్తో కలిసి ప్రభుత్వాన్ని కూలుస్తామనడం సరైంది కాదని ఆయన అన్నారు.