అన్ని ఉద్యోగాలూ తెలంగాణ వారివే: జిహెచ్ఎంసి సదస్సులో కెసిఆర్

జిహెచ్ఎంసిలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్గా మార్చాలని డిమాండ్ చేశారు. శుభ్రం చేసే దగ్గర తెలంగాణ వాళ్లు ఉంటే బంగ్లాలో ఆంధ్రా అధికారులు ఉంటున్నారన్నారు. తెలంగాణ తప్పకుండా వచ్చి తీరుతుందన్నారు. తెలంగాణలో అన్ని వనరులు ఉన్నప్పటికీ వలసవాద పాలనలో ఏమీ లేనట్లుగా తయారయిందన్నారు. నగరంలో 12మంది అడిషనల్ కమిషనర్లు ఉంటే తెలంగాణకు చెందిన వారు ఒక్కరే ఉన్నారన్నారు. కాంట్రాక్టులు, ఔట్ సోర్సింగులు కూడా ఆంధ్రావారివే అన్నారు. ప్రభుత్వం జిహెచ్ఎంసిలో తెలంగాణ కార్మికల వెతలు తీర్చకుంటే 7వ తేదినుండి సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications