వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశం సున్నితమైంది, ఏకాభిప్రాయానికి ప్రయత్నాలు: ప్రధాని
రాబోయే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని, భవిష్యత్తు ప్రధాని ఎవరనేది మాట్లాడడం కూడా తొందరపాటే అవుతుందని ఆయన అన్నారు. తమ భాగస్వామ్య పక్షాలన్ని తమతోనే ఉన్నాయని, యుపిఎ ప్రభుత్వం పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేయాలని అనుకోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తమ సంకీర్ణ ప్రభుత్వం బలంగానే ఉందని ఆయన చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని ఆయన చెప్పారు. అవినీతి వ్యవహారాల్లో దోషులకు శిక్ష పడాలనేదే తమ అభిమతమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాల సహకారం లేకపోవడంతో అనుకున్నవన్నీ చేయలేకపోతున్నామని ఆయన చెప్పారు.
English summary
Prime Minister Manmohan Singh Said that Telangana issue is critical and Home Minister Chidambaram is holding meeting with political parties of Andhra Pradesh. He said Issue will be solved with consultations with political parties.
Story first published: Wednesday, February 16, 2011, 12:19 [IST]