హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి నిట్టనిలువునా చీలిపోయింది, ఎవరినీ పట్టించుకోను: నాగం జనార్ధన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం కరెంటోళ్ల మహా దీక్షలో అన్నారు. తెలంగాణ అంశం విషయంలో టిడిపి రెండుగా చీలిపోయిందని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ టిడిపి ఫోరం కట్టుబడి ఉందని చెప్పారు. టిడిపి తెలంగాణ నేతలు అందరూ తెలంగాణకు కట్టుబడి ఉన్నారన్నారు. ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. తెలంగాణ టిడిపిలో ఎవరైనా ద్రోహులు ఉంటే వారి తాట తీస్తామని హెచ్చరించారు.

తెలంగాణ వ్యతిరేకి అయిన గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అడ్డుకుంటామని నాగం స్పష్టం చేశారు. ఆంధ్రా పాలకులు ఇప్పటికే చాలా దోచుకున్నారని ఇప్పటికైనా మా తెలంగాణ మాకు ఇచ్చి వెళితే బావుంటుందని సూచించారు. తెలంగాణ కోసం ఎవరి గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నారు.

సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సర్కారు భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రధానిని, కేంద్రాన్ని తెలంగాణకు ఒప్పించిన తర్వాతే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. సీమాంధ్ర నేతలు ఇక్కడి నుండి వెళ్లిపోయి జై ఆంధ్ర ఉద్యమం చేసుకుంటే బావుంటుందని సూచించారు.

English summary
Telugudesam party is divided into Telangana TDP and Seemandhra TDP, said Telugudesam Party leader Nagam Janardhan Reddy. He said Telangana TDP Forum is commited for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X