వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానం హెచ్చరికలు బేఖాతరు: ఢిల్లీలోనే టి-కాంగ్రెసు ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన హామీ కోసం వెళ్లిన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు, శాసనమండలి నాయకులు ఢిల్లీ స్థాయి నేతల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న సెంటిమెంటు నేపథ్యంలో వారు ఏదో ఒక హామీతో వస్తే తప్ప ఇక్కడి ప్రజలు తీవ్రంగా స్పందించే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు న్యూఢిల్లీలోనే ఉండి హామీ కోసం ఎదురు చూస్తున్నారు. బుధవారం ఎడిటర్స్ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో వారు మరింత ఇరకాటంలో పడ్డారు. అయితే ప్రధాని మాటలతో తమకు సంబంధం లేదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీయే ముఖ్యమని చెబుతున్నారు.

గురువారం నుండి బడ్జెట్ సమావేశాలు ఉన్న దృష్ట్యా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లి సమావేశాలలో పాల్గొనవల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ వారిని హైదరాబాద్ వెళ్లి పోవాల్సిందిగా చెప్పారు. మనీష్ తివారి ఢిల్లీ వెళ్లి పోవాల్సిందిగా హెచ్చరించినట్లుగా కూడా సమాచారం. అయితే వీరి హెచ్చరికలను ఎమ్మెల్యేలు మాత్రం బేఖాతరు చేస్తూ ఢిల్లీలోనే సోనియా నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉండాలనే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమ ప్రాంతంలోని పరిస్థితుల నేపథ్యంలోనే మేం అధిష్టానం ముందుకు వచ్చామని ఆషామాషీగా రాలేదని వారు చెబుతున్నారు. అయితే వారికి సోనియా అపాయింట్‌మెంట్ దొరకక పోవడం కలవరం కలిగిస్తోంది.

కాగా గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థికశాఖామాత్యులు ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నారు. ప్రణబ్‌తో బేటీ అనంతరం కొందరు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బయలు దేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీ వారితో తెలంగాణపై త్వరలో అఖిలపక్షాన్ని రెండోసారి పిలుస్తామని, అప్పటి వరకు ఓపిక పట్టాలని చెప్పే అవకాశముంది.

English summary
It seems, Telangana Congress MLAs and MLCs are neglecting High Command orders. MLAs sat in New Delhi for High Command promise on Telangana. They did not cared Veerappa Moily and Manish Tiwari ordered about participation of budget sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X