తెలంగాణపై ఢిల్లీ వెళ్లి తేల్చుకోండి: కెసిఆర్‌కు డిఎస్ హితవు

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ పేరుతో హింసకు పాల్పడటం హేయమైన చర్య అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విషయంలో పోరాడటం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసి అందరూ నేర్చుకోవాలని సూచించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై, గవర్నర్ నరసింహన్ చేతిలోని ప్రతులు చించివేయడం వంటి చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయన్నారు. కొందరు హింసకు పాల్పడుతూ తెలంగాణ ప్రజల పరువు తీశారన్నారు. ఒక సాధారణ డ్రైవర్ ఓ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారణమన్నారు. అసెంబ్లీలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. అభీష్టం నెరవేరకుంటే అందరూ నిరసనలు చేయవచ్చన్నారు. అయితే ఆ నిరసనలకు హద్దు ఉంటుందని అన్నారు.

తెలంగాణ కోసం అంటూ ఇక్కడ ఉద్యమాలు చేస్తే సరిపోదన్నారు. కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెళ్లినట్టు అందరూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మహాత్మాగాంధీ పద్ధతిలో పోరాడుతామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఘటన ఆయనకు గాంధేయవాదంలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. సహాయ నిరాకరణతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సహాయ నిరాకరణను కూడా రాజకీయం చేశారని ఆక్షేపించారు. సహాయ నిరాకరణల పేరుతో సర్కారు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించ వద్దని డిఎస్ ఉద్యోగులను కోరారు.

ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువు ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు లేనందున సర్వే నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏమాత్రం లేదన్నారు. కొందరిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వేలకు ఇది సమయం కూడా కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+