వైయస్ జగన్ దీక్షపై కామెంట్స్కు చంద్రబాబుపై జయసుధ ఫైర్

వైయస్ జగన్ విద్యార్థుల కోసం దీక్ష చేస్తుంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. వైయస్ జగన్ దీక్షను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అనడాన్ని ఆమె వ్యతిరేకించారు. వైయస్ జగన్కు, తెరాస నాయకులకు మధ్య రహస్య అవగాహన కుదిరిందని అనడం తెలుగుదేశం నాయకుల అవివేకమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications