కాల్పులతో దద్దరిల్లుతున్న ఉస్మానియా, విద్యార్థుల రాళ్ల వర్షం

విద్యార్థులు జామై ఉస్మానియా రైల్వే స్టేషన్లో ఓ రైలు బోగీకి నిప్పు పెట్టారు. నెక్లస్ రోడ్డు రైల్వే స్టేషన్ను ధ్వంసం చేశారు. రిజర్వేషన్ కౌంటర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రైల్వే శాఖ ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను బంద్ చేసింది. బుకింగ్ కౌంటర్ను మూసివేసింది. కాగా తెలంగాణకు చెందిన పలువురు లాయర్లు రాజ్ భవన్కు ముట్టడికి ర్యాలీగా బయలు దేరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని, వెంటనే తెలంగాణ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లాయర్లను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద అరెస్టు చేశారు. కాగా మంగళవారం, బుధవారం జరిగే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా రిజిస్ట్రార్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications