వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ రెచ్చగొడుతున్నారు, తెలంగాణ ఖాయం: ఎంపీ సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Survey Satyanarayana
న్యూఢిల్లీ: కెసిఆర్ విద్యార్థులను, ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుడు సర్వే సత్యనారాయణ సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల కోసం న్యూఢిల్లీ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసమే తమ పార్టీ పుట్టిందని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, ఎంపీ విజయశాంతి పార్లమెంటు సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రసంగాన్ని ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అంటూ ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారన్నారు. తెలంగాణ సమస్య రాష్ట్రంలో తీరేది కాదని, కేంద్రంలో తీరే సమస్య అన్నారు. కెసిఆర్ సోనియాగాంధీ వద్దకు వచ్చి అడగాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి తెలంగాణ కోరాలని ఇప్పటి వరకు చెప్పామని అయితే కెసిఆర్ మాత్రం అలా చేయలేదన్నారు. కెసిఆర్ కలిసి వచ్చినా కలిసి రాకున్నా తెలంగాణ తెచ్చేది మేం అని, ఇచ్చేది మా పార్టీ అన్నారు. మా సహనాన్ని పరీక్షించ వద్దని కెసిఆర్‌ను హెచ్చరించారు. ఢిల్లీలో ఏం మాట్లాడకుండా, రాష్ట్రంలో మాత్రం అందరినీ రెచ్చగొడుతూ అక్కడ హీరో అవుతూ, మమ్మలను విలన్లను చేద్దామని కెసిఆర్ అనుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలను తిడితే బావుండదని హెచ్చరించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కేసిఆర్ ఉద్యమం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు.

English summary
MP Survey Satyanarayana blamed TRS president K Chandrasekhar Rao on Telangana issue. He accused that KCR provacating students and employees. He questioned KCR and Vijayashanthi, why they were not obstruct president's speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X