ప్రముఖ తెలుగు సినీ నటుడు మిక్కిలినేని రాధాకృష్ణ కన్నుమూత

ఐదు దశాబ్దాలపాటు సినీరంగంలో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలను పోషించిన ఆయన సుమారు 340 చిత్రాలలో నటించారు. భైరవద్వీపం ఆయన చివరి చిత్రం. మిక్కిలినేని భౌతిక కాయాన్ని విజయవాడ మొగల్రాజపురంలోని ఆయన స్వగృహంలో ఉంచారు. ఆయన మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, సినీరంగ ప్రముఖులు మిక్కిలినేని మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబసభ్యులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications