హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్సీ ఎన్నికలపై చిరంజీవితో డి. శ్రీనివాస్ మంతనాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో మంతనాలు జరిపారు. మంగళవారం రాత్రి చిరంజీవి ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ ఆయనతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకోవాలని ఈ ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల శాసనసభ్యులు, నాయకులు సమన్వయంతో వ్యవహరించాలని భావించారు. కాంగ్రెస్‌లో ప్రరాపా విలీన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ప్రజారాజ్యం పార్టీకి అవకాశం వస్తుందని అంటున్నారు.

ఎమ్మెల్యే కోటానుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ కోటాలో పదవీవిరమణ చేస్తున్న ఆర్‌.గోపీనాథ్‌, చెంగల్రాయుడు, పాలడుగు వెంకట్రావు, మహ్మద్‌జానీ, కేబీ నారాయణప్పలు మళ్ళీ పదవి ఆశిస్తున్నారు. వీరంతా సీఎంని, పీసీసీ అధ్యక్షుణ్ణి కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వీరు కాకుండా పలు జిల్లాలనుంచి నేతలు పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మహీధర్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌, ఉగ్ర నరసింహారెడ్డి తదితర ఎమ్మెల్యేలు మంగళవారం సీఎంని కలిసి తమ జిల్లానుంచి ఎమ్మెల్యే కోటాలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు అవకాశం ఇవ్వాలని కోరారు. తక్కువ సీట్లున్నాయని, పోటీ అధికంగా ఉందని, పరిశీలిస్తానని ఆయన హామీనిచ్చారు.

English summary
PCC president D Srinivas met yesterday night with Prajarajyam president Chiranjeevi to chalk out strategy to be adapted for MLC election. They decided to work with coordination in MLC election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X