ఎమ్మెల్సీ ఎన్నికలపై చిరంజీవితో డి. శ్రీనివాస్ మంతనాలు
ఎమ్మెల్యే కోటానుంచి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ కోటాలో పదవీవిరమణ చేస్తున్న ఆర్.గోపీనాథ్, చెంగల్రాయుడు, పాలడుగు వెంకట్రావు, మహ్మద్జానీ, కేబీ నారాయణప్పలు మళ్ళీ పదవి ఆశిస్తున్నారు. వీరంతా సీఎంని, పీసీసీ అధ్యక్షుణ్ణి కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వీరు కాకుండా పలు జిల్లాలనుంచి నేతలు పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మహీధర్రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఉగ్ర నరసింహారెడ్డి తదితర ఎమ్మెల్యేలు మంగళవారం సీఎంని కలిసి తమ జిల్లానుంచి ఎమ్మెల్యే కోటాలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు అవకాశం ఇవ్వాలని కోరారు. తక్కువ సీట్లున్నాయని, పోటీ అధికంగా ఉందని, పరిశీలిస్తానని ఆయన హామీనిచ్చారు.
Comments
చిరంజీవి ప్రజారాజ్యం శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెసు హైదరాబాద్ chiranjeevi prajarajyam srinivas mlc election congress hyderabad
English summary
PCC president D Srinivas met yesterday night with Prajarajyam president Chiranjeevi to chalk out strategy to be adapted for MLC election. They decided to work with coordination in MLC election.
Story first published: Wednesday, February 23, 2011, 10:42 [IST]