తెలంగాణ ఎంపీలకు ప్రధాని బుజ్జగింపు, నిర్ణయానికి హామీ

తనతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమైన తర్వాత ప్రధాని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు చర్య సరైంది కాదని మొయిలీ అన్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ పట్టు వీడలేదు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని వారు ప్రధానితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు.












Click it and Unblock the Notifications