వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపీలకు ప్రధాని బుజ్జగింపు, నిర్ణయానికి హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ‌: లోకసభలో ఆందోళనకు దిగిన తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులను బుజ్జగించేందుకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. తెలంగాణ అంశంపై ఆందోళనతో లోకసభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రధానిని కలిశారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పవన్ కుమార్ బన్సల్‌లను కూడా వారు కలిశారు. తెలంగాణ సీరియస్ అంశమని, తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని, అప్పటి దాకా ఓపిక పట్టాలని ప్రధాని తెలంగాణ పార్లమెంటు సభ్యులకు చెప్పారు.

తనతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమైన తర్వాత ప్రధాని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు చర్య సరైంది కాదని మొయిలీ అన్నారు. అయితే, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తమ పట్టు వీడలేదు. అవసరమైతే రాజీనామాలు చేస్తామని వారు ప్రధానితో చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు.

English summary
PM Manmohan singh tried to vow Congress Telangana region MPs in the wake of stalling Loksabha proceedings on Telangana issue. PM promised to take decision on Telangana as early as possible. He suggested MPs to cooperate with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X