హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో దారుణం: భార్యను ముక్కలుగా నరికిన భర్త

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. భార్య దేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికాడు. హైదరాబాదు శివారులో గల పొప్పల్గుడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా గోవిందపల్లికి చెందిన ఎస్ రమణమ్మ అనే 35 ఏళ్ల మహిళ 40 ఏళ్ల బి. అల్లూరయ్య ప్రేమలో పడ్డారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాములను వదిలేసి హైదరాబాదు వచ్చి జీవిస్తున్నారు. అప్పటి నుంచి వారిద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం - ఇటీవల అల్లూరయ్య పొప్పల్‌గుడాలోనిీ ఎల్‌ఎన్ఆర్ రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా చేరాడు. తన భార్య మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుందని అల్లూరయ్య అనుమానించేవాడు. దీంతో ఇరువురి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో అల్లూరయ్య తన భార్య రమణమ్మను నరికి చంపాడు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ ఫ్లాట్ ఓనర్ వాచ్‌మన్ గది వద్ద శరీరభాగాలు పోగు చేసి ఉండడం గమనించి ఇతర ఫ్లాట్ యజమానులకు చెప్పాడు. అపార్టుమెంట్ కార్యదర్సి సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న అల్లూరయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
In a gruesome incident, a watchman suspecting his wife's fidelity, hacked her to death and cut her body into eight pieces at their house in Poppalguda on the outskirts of the city on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X