ఎంపీలను చూసి బుద్ధి తెచ్చుకోండి: మంత్రులకు నాగం సూచన
ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఈజిప్టు తరహా ఉద్యమం తెలంగాణలో వస్తుందన్నారు. తెలంగాణ కోసం పది జిల్లాలనుండి కోటి మంది తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్ను పూర్తిగా దిగ్బంధించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం ప్రభుత్వం వెంటనే తెలంగాణపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ మంత్రులు లేఖలు రాసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదన్నారు. మంత్రులు కుర్చీలు వదిలి బయటకు రావాలన్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఎంపీల తీరును చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు అంతా కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోసం ఒప్పించాలన్నారు.
Comments
నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెసు అసెంబ్లీ హైదరాబాద్ nagam janardhan reddy telangana congress assembly hyderabad
English summary
TDP senior MLA Nagam Janardhan Reddy suggested congress MLAs and Minister to follow Congress MPs, how to protest in assembly. Nagam blamed central and state government on students and employees issue.
Story first published: Friday, February 25, 2011, 9:45 [IST]