బంద్ ఉద్రిక్తం: ఎమ్మెల్యే రాంరెడ్డిపై తెలంగాణవాదుల ఆగ్రహం
కాగా ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే వర్గీయుల దాడిని, బంద్ అడ్డుకోవడాన్ని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఖండించారు. అయితే ఈ సంఘటనతో దామోదర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి అని మేం అనుకోవడం లేదని, అయితే కేవలం ఒక స్థానిక సంఘటనతో ఇంత ఉద్రిక్తత నెలకొనడం సరికాదన్నారు. అయితే సూర్యాపేటలో తెలంగాణ జెఏసికి మా మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాంరెడ్డి వంటి తెలంగాణవాది నుండి ఇలాంటి సంఘటన మేం ఊహించలేదని కోదండరామ్ అన్నారు.
కాగా గురువారం ఓ సన్మాన కార్యక్రమం సందర్భంగా టిఆర్ఎస్ నేతలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఫ్లెక్సీని చించి వేశారు. ఫ్లెక్సీ చించినందుకు నిరసనగా ఎమ్మెల్యే వర్గీయులు టిఆర్ఎస్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. టిఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు నిరసన తెలియజేసేందుకు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదులాట, తోపులాట నుండి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే వర్గీయులు టిఆర్ఎస్ నేతలను దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. దీంతో శుక్రవారం సూర్యాపేట బంద్కు జెఏసి పిలుపునిచ్చింది.