అంకుల్ పాయ్ ఇక లేరు, ఆయన సృష్టి అమర్ చిత్రకథ ఉంది

Ananth Pai
ముంబై: దేశంలోని ఎంతో మందిని అలరించిన 'అంకుల్ పాయ్" అనంత్ వి పాయ్ గురువారం సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. అమర్ చిత్ర కథ కామిక్స్ ద్వారా భారతీయ సంస్కృతి, ఆచారాలను పాఠకులకు 'అంకుల్ పాయ్" అందించారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కనారా జిల్లాలోని కర్కాలలో అనంత పాయ్ జన్మించారు. ముంబై యూనివర్సిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పొందారు. ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌లో చేరి ఇంద్రజాల్ కామిక్స్ ద్వారా ఫాంథామ్, మంద్రకే ది మెజీషియన్ శీర్షికల ద్వారా పిల్లలను ఆకట్టుకున్నారు.

ఒక సమయంలో దూరదర్శన్‌లో ప్రసారమైన క్విజ్ పోటీలో రామాయణంలో రాముడి తల్లి ఎవరూ అన్న ప్రశ్నకు సమాధానమివ్వకపోవడంతో మనస్థాపం చెంది కామిక్స్ ద్వారా భారతీయ పురాణాలను, సంస్కృతిని అందించాలని నిశ్చయించుకున్నారు. ఆతర్వాత అమర్ చిత్ర కథను ప్రారంభించి ఎడిటర్, గ్రాఫిక్ మాస్టర్, రచయిత, ప్రచురణకర్త, చరిత్రకారుడిగా పలు బాధ్యతల్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షాలాధి మంది పాఠకుల్ని సొంతం చేసుకుని అమర్ చిత్ర కథ 20 భాషల్లోకి అనువాదమైంది. పెద్దల్ని సైతం ఆలరించిన ట్వింకిల్ కూడా అంకుల్ పాయ్ సృష్టించిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+