తెలంగాణ బిల్లు పెట్టించాలని సిఎంను కోరిన టిడిపి తెలంగాణ నేతలు

గిర్గ్లానీ కమిటీ నివేదికను అమలు చేయాలని, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విడుదలైన 610 జీవోను అమలు చేయాలని తాము ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లను ఆపేయడం సరి కాదని, దానివల్ల 95 మంది ఉద్యోగులకు అన్యాయం జరిగిందని తాము ముఖ్యమంత్రికి చెప్పినట్లు ఆయన తెలిపారు. రేపటి రైల్ రోకోకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలు రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. సహాయ నిరాకరణ చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే తాము సహించబోమని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు.












Click it and Unblock the Notifications