కాకరాపల్లి ఘటనపై మంత్రి బొత్సకు నారాయణ కితాబు

అయితే అదే సమయంలో బాధితులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధితులపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన బొత్సను కోరారు. తప్పు ఒప్పుకున్నందుకు అభినందనలు తెలుపుతూ బాధితులకు సహకరించాలని నారాయణ కోరారు. అమాయక ప్రజలపై పోలీసులు కేసులు పెట్టారని వారిపై కేసులు ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఓ వృద్ధురాలిపై హత్యా కేసు పెట్టారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications