తెలంగాణ అంశం: అధిష్టానంపై దామోదర్ రెడ్డి ధిక్కారం

సీమాంధ్ర నేతలు గత డిసెంబర్ 10న చేసిన కుట్ర మళ్లీ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఎంపీ కావూరి సాంబశివరావు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతల చర్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్లో గానీ మరెక్కడైనా ఏమైనా జరిగితే దానికి సీమాంధ్ర నేతలే బాధ్యత వహించాలన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెసు అధిష్టానంపై నమ్మకంతో ఓపిక పట్టామని చెప్పారు. అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ సాధిస్తామని రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగామపై కుట్రల కోసమే సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారన్నారు.












Click it and Unblock the Notifications