జగన్‌ సమస్య కాదు, ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ఎజెండా!: ఈటెల

Etela Rajender
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తుందా లేదా అన్నది సమస్య కాదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆదివారం అన్నారు. తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెసు ప్రభుత్వం కూలిపోవాల్సిందే అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చి వేయడమే మా ఎజెండా అని స్పష్టం చేశారు. మేం తెలంగాణ రాష్ట్రాన్ని అడుగుతున్నాం కానీ దేశాన్ని అడగటం లేదన్నారు. కేంద్రమంత్రి చిదంబరం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యపై రోజులు గడుస్తున్న కొద్ది ప్రభుత్వానికి మతి పోతోందన్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై అటా ఇటా తేల్చోకోవాలన్నారు. తెలంగాణ సాధన కోసం పదిలక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేయాలని మార్చి 10న మిలియన్ మార్చ్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశ పెట్టే వరకు శాసనసభా సమావేశాలను జరగనిచ్చేది లేదని హెచ్చరించారు. సమైక్యాంధ్రలో అసెంబ్లీ సమావేశాలు జరగనిచ్చేది లేదన్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు అటా ఇటా తేల్చుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఇస్తామని 2009 డిసెంబర్ 9న మాట ఇచ్చి ఆ తర్వాత మాట తప్పిన కాంగ్రెసు అధిష్టానం వైపు ఉంటారా, లేదా తమను ఎన్నికలలో గెలిపించి తెలంగాణ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల వైపు ఉంటారా అనేది కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకోవాలన్నారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ సాధించే వరకు టిఆర్ఎస్ ఉద్యమిస్తుందన్నారు. అసెంబ్లీలో, బయట తెలంగాణ ఉద్యమ కార్యాచరణ కోసం బుధవారం సమావేశం అవుతున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+