హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి రాజగోపాల్ బ్లాక్ మెయిలర్: తెరాస ఎమ్మెల్యే హరీష్‌ రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ శాసనసభ్యుడు హరీష్‌రావు బుధవారం అన్నారు. లాయరు అడుసుమిల్లి జయప్రకాశ్ చర్యలను కూడా హరీష్‌రావు తప్పు పట్టారు. అడుసుమిల్లి లగడపాటి చెంచా అని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ ఏం చెబితే అడుసుమిల్లి అది చేస్తారని అన్నారు. కేంద్ర మంత్రి చిదంబరం మాటలను కూడా హరీష్‌రావు ఖండించారు. చిదంబరం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అన్నారు. తెలంగాణ అంశం రాత్రికి రాత్రే తేలదని చెప్పడం చాలా విడ్డూరమన్నారు. తెలంగాణ సమస్య ఇప్పటిది కాదన్నారు. ఇది 56 ఏళ్ల సమస్య అని చెప్పారు.

యాభయ్యేరేళ్ల పోరాడానికి తోడు రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న విషయం వారి దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు మేం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని, గురువారం నుండి అసెంబ్లీకి వెళ్లాలా వద్దా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు కుట్రతో దానిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణను అడ్డుకుంటారన్నారు.

English summary
TRS MLA Harish Rao blamed Vijayawada MP Lagadapati Rajagopal today. He said Lagadapati is making black mail politics. He blamed lawyer adusumalli jayaprakash also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X