లగడపాటి రాజగోపాల్ బ్లాక్ మెయిలర్: తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు

యాభయ్యేరేళ్ల పోరాడానికి తోడు రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న విషయం వారి దృష్టికి రాకపోవడం విచారకరమన్నారు. ఇప్పటి వరకు మేం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని, గురువారం నుండి అసెంబ్లీకి వెళ్లాలా వద్దా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు కుట్రతో దానిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణను అడ్డుకుంటారన్నారు.












Click it and Unblock the Notifications