చంద్రబాబును ఎందుకు కలవాలి: జెసిపై యనమల గుర్రు

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్రమంత్రి చిదంబరం కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణ అంశాన్ని వాయిదా వేస్తూ వెళ్లడం వల్లనే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం ఏదో ఒకటి తేల్చాలని చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేయడమే కాంగ్రెస్ ఎజెండా అని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు సభను బహిష్కరించరని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటమే టిడిపి ఉద్దేశ్యమన్నారు. ఏ సమస్య అయినా సభ ద్వారా పట్టుపడతామన్నారు. ప్రజల కోసం సభలో అందరం ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications