ఎంపీ కావూరి సాంబశివరావుపై విరుచుకుపడిన తెలంగాణ మంత్రులు

అధికారం లేకుంటే బతకలేని వాళ్లు సీమాంధ్ర పెట్టుబడి నేతలే అని ఆరోపించారు. కావూరి ఎంపీ అయిందే దోచుకోవడానికి అని అన్నారు. గంటసేపు అధికారం లేకుంటే బ్రతకలేని వాళ్లు తెలంగాణ వాళ్లు కాదని కావూరి లాంటి వాళ్లే అన్నారు. ఆయన దోచుకోవడానికి ఎంపీ అవుతున్నారని, అందుకే ఆయన ఐదుసార్లు ఎంపీ అయినా మంత్రి పదవి రాలేదని, అదే పురందేశ్వరికి ఒకేసారికి వచ్చిందన్నారు. కావూరి తెలంగాణ నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనకు ధనార్జనే ధ్యేయమన్నారు. ఆయన వ్యాఖ్యల ద్వారా పెట్టుబడిదారి మనస్తత్వం మరోసారి బయటపడిదంన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను విమర్శించే హక్కు లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై మాకు నమ్మకం ఉందన్నారు. ఆమె వద్దే తెలంగాణ అంశంపై తేల్చుకుంటామని చెప్పారు. రెండురోజుల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. రాజీనామాలకు కూడా సిద్ధమని హెచ్చరించారు.
కావూరి తన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మరో మంత్రి బస్వరాజు సారయ్య డిమాండ్ చేశారు. లేదంటే కావూరిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. సోనియాపై మాకు నమ్మకముందని, ఆ నమ్మకంతోనే తెలంగాణ సాధిస్తామని చెప్పారు. కాగా నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజీనామా విషయమై కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలతో చర్చించిన అనంతరం నిర్ణయించుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications