చంద్రబాబు డ్రామా: రాజీనామాలకు సీమాంధ్ర, తెలంగాణ పోటాపోటీ

సమైక్యాంధ్ర కోసం బలమైన పోరాటం సమైక్యాంధ్ర కోసం బలమైన పోరాటం చేస్తామని టిడిపి సీనియర్లు దాడి వీరభద్రరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు అనుగుణంగా సమైక్యాంధ్రను కొనసాగిస్తూ కేంద్రం తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండు చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే రాజీనామాలకూ తాము సిద్ధమని గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించారు. శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శించడం తప్పేమీ కాదని, తమ ప్రాంత ప్రజల ఒత్తిడికి, మనోభావాలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్ని అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీయే కారణమని ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం తామూ రాజీనామాలకు సిద్ధమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం ప్రకటించింది. తెలంగాణ లేకుండా సమైక్యాంధ్ర అని ఎలా అంటారని ప్రశ్నించింది. తెలంగాణ ఫోరం సమావేశం అనంతరం నాగం జనార్దన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర చేయాలని ఈ సమావేశంలో ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ప్రతిపాదించారని తెలిసింది. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసున్నంత కాలం కలిసుంటారని, కానప్పుడు ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉందని నిజామాబాద్ సభలోనే చెప్పారని, ఈ దృష్ట్యా అక్కడివరకు పాదయాత్ర చేద్దామన్నారు. అయితే శుక్రవారం మరోసారి సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుందామని అనుకున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications