హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్లుండి నుంచి అసెంబ్లీకి తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: సోమవారం నుంచి శాసనసభకు హాజరు కావాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయించుకున్నారు. శనివారం సమావేశమైన వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు శాసనసభా సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులు సహాయ నిరాకరణను విరమించుకున్న నేపథ్యంలో వారు శాసనసభకు హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ స్ఫూర్తితోనే తాము శాసనసభ సమావేశాలను బహిష్కరించామని వారు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ స్థాయి ఉద్యమాలను నిర్వహించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమంతోనైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని వారన్నారు. శాసనసభకు హాజరు కావాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడడంతో ఎల్లుండి నుంచి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.

English summary
TDP Telangana region MLAs decided to attend assembly session from monday. TDP Telangana MLAs met today to decide whether to attend assembly or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X